Latest News
Politics
కామారెడ్డి, నిజామాబాద్లో వ్యాక్సినేషన్పై మంత్రి వేముల సమీక్ష
హైదరాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత 10 నెలలుగా ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టిన కరోనాకు వ్యాక్సిన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో పాల్గొన్న పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు, వైద్యులకు, అధికారులందరికీ ధన్యవాదాలన్నారు. భారత […]
Crime
చిమ్మచీకటి.. గూగుల్ మ్యాప్సే ఆధారం.. ఇంతలో అనూహ్యంగా..
న్యూఢిల్లీ: గూగుల్ మ్యాప్స్..కొత్త ప్రదేశానికి వేళ్లాలనుకునేవారి మార్గదర్శి! దీని ద్వారా ఎందరో నిత్యం తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. అయితే..గూగుల్ మ్యాప్స్ చూపించే దారిలోనే ప్రయాణిస్తూ ఓ వ్యక్తి అనూహ్యంగా మృత్యు ఒడికి చేరుకున్నాడు. మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సతీశ్ గులే అనే వ్యక్తి గురుశేఖర్ వద్ద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వారిద్దరికీ అంతకుమనునపే పరిచయం ఉంది. కొవిడ్ కారణంగా సతీశ్ ఉద్యోగం కోల్పోవడంతో అతడిని గురుశేఖర్ తన వద్ద డ్రైవర్ ఉద్యోగం ఇచ్చాడు.
కడప జిల్లా ముద్దనూరులో రోడ్డుప్రమాదం
కడప జిల్లా ముద్దనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ముద్దనూరు నుండి చిన్న దుద్యాల గ్రామానికి వెళ్తున్న ఆటోను పులివెందుల నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Sports
తొలి రౌండ్ లోనే వెనుదిరిగిన పివి సింధు..
కరోనా తర్వాత భారత స్టార్ షెట్లర్ పివి సింధు థాయ్లాండ్ ఓపెన్ 2021 లో పాల్గొంది. అయితే ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్లోనే ఓటమిపాలై వెనుదిరిగింది సింధు. తొలి రౌండ్లో డెన్మార్క్ కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్ చేతిలో 21-16, 24-26, 13-21 తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి పై మొదటి రౌండ్లో ఆధిపత్యం చూపించిన సింధు రెండో రౌండ్ ను కూడా అలానే ప్రారంభించింది. కానీ ఆ తర్వాత బ్లిచ్ఫెల్డ్ పుంజుకొని రెండు, మూడు […]
పోలీసుల తీరుపై ధ్వజమెత్తిన రఘురామకృష్ణంరాజు
పశ్చిమగోదావరి: పోలీసుల తీరుపై ఎంపీ రఘురామకృష్ణంరాజు ధ్వజమెత్తారు. కోడిపందాల సాకుతో అమాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. కత్తులు కట్టి పందాలు నిర్వహిస్తే, నేరం అని కోర్టు చెప్పింది. కోళ్లను పెంచితే కాదన్నారు. కోర్టు ఆదేశాల సాకుతో పోలీసులు ఒవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. జీవనోపాధి కోసం కొందరు కోళ్లు పెంచుతుంటే, వాటిని తీసుకుపోతున్నారని చెప్పారు. కోళ్లు తీసుకు వెళ్లే వారు దొంగలతో సమానం.. దొంగలకు ఏ విధంగా బుద్ధి చెబుతారో వారికి అలాగే చేయండని సూచించారు. విగ్రహాలు ధ్వంసం చేసిన […]
Ad’s

Seach by date
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |